MNCL: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని జన్నారం మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్ అన్నారు. బుధవారం తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ పనిచేస్తుందని చెప్పారు. గ్రామాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.