KDP: చెన్నూరు(మం) రుద్రభారతిపేటకు చెందిన దుర్గం దస్తగిరి(37) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దస్తగిరిని ఎవరైనా ఎక్కడైనా చూసి, సమాచారం తెలిసినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.