KNR: హుజూరాబాద్ మండలంలో 4 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఇంగ్లీష్ పరీక్ష మండలంలో 821 మంది హాజరుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 291, గురుకులాల నుంచి 235, ప్రైవేట్ పాఠశాలల నుంచి 295 మంది ఉన్నారు. ఉ.9:30-12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పట్టణంలో 3 పరీక్ష కేంద్రాలు, చెల్పూర్ ZPHSలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు MEO తెలిపారు.