MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద AITUC ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 2025 సెప్టెంబర్లో అందజేయాల్సిన పంప్ ఆపరేటర్ల ప్రమోషన్లను యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని కార్మికులు ఆగ్రహించారు. మైన్స్ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు విన్నవించినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆందోళన చేపట్టామన్నారు.