రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి కల్పన(35) మంగళవారం రాత్రి మరణించింది. తెల్లారి బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, తన భవిష్యత్తు కోసం మనో ధైర్యంతో కుమారుడు రవితేజ పరీక్షను రాసి అందరిని కలిచివేశాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా పరీక్షకు వెళ్లి, అనంతరం తల్లి అంతక్రియలకు హాజరయ్యాడు.