NLG: ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 7 డిపోల పరిధిలో నిత్యం 2,82,150 మంది ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరిగినా, దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులకు తోపులాట తప్పడం లేదు. గత 3నెలలుగా ‘డయల్ యువర్ ఆర్ఎం’ నిర్వహించకపోవడంతో సమస్యలు చెప్పుకోవడానికి వీలులేకుండా పోయింది.