KMR: మహమ్మద్నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంకు చెందిన టేక్మాల్ మమత తన భర్త ప్రమాదంలో మృతి చెందిన అనంతరం, కౌలుకు ఇచ్చిన 7 గుంటల భూమిని తిరిగి ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ KMR జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం తన భర్త సుధాకర్కు యాక్సిడెంట్ జరిగి అనంతరం మృతి చెందాడని తెలిపారు.