GDWL: అయిజలో బయటపడ్డ నకిలీ పత్రాలు, స్టాంపుల దందాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ప్రింటింగ్ ప్రెస్ పై దాడి చేస్తే ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇక్కడి నుంచే నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసినట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.