HYD: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) బుధవారం కన్నుమూశారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇవాళ ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్ నివాసానికి తీసుకువస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఆయన అంత్యక్రియలను మార్చి 12న జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.