JGL: చెస్ పోటీల ద్వారా మేధాశక్తి పెంపొందుతోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ, చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. విద్యార్థులు చెస్ పోటీల్లో రాణించి జగిత్యాలకు పేరు తీసుకురావాలన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి, తదితరులు పాల్గొన్నారు.