NRML: జిల్లాలో SSC పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు జిల్లాలో 9750 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.