MBNR: మిడ్జిల్ మండలం సింగందొడ్డి గ్రామంలో వచ్చే నెల 5న నిర్వహించనున్న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నిర్వాహకులు సోమవారం మండల అధికారులను ఆహ్వానించారు. అంబేడ్కర్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు కలిసి ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సైలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని భరోసా ఇచ్చారు.