MDK: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మంగళవారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో వీరేశం తెలిపారు. ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ ముగిశాక 6 గంటల నుంచి ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ రోజున అన్ని రకాల పూజలు, సేవలను నిలిపివేస్తామన్నారు. తిరిగి మార్చి 4న బుధవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.