JGL: మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద వరద కాలువలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తి నిరాధారమన్నారు. వేసవి కరువులో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.