ADB: రైతులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న బరంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ అనే నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి మంగళవారం తెలిపారు. నిందితుడు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగుల నుంచి సైతం ఉద్యోగుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలియజేశారు.