SRCL: పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని 10వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ పథకం ద్వారా అనేక కుటుంబాల్లో సొంతింటి వెలుగులు నిండుతున్నాయన్నారు.