SRCL: సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్, అనంత నగర్ 26వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డిమల్ల భాను మంగళవారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పెరుమాండ్ల సంతోశ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, పాల్గొన్నారు.