JGL: గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గుండు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.10 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. గంగాదేవిపల్లిలో రూ.20 లక్షల పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. మహిళల అభ్యర్థనపై గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.