HYD: గోల్కొండ, రాజేంద్రగనర్, గండిపేట మండలాల పరిధిలో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూములు, స్థలాలు సేకరించాల్సి ఉంది. అయితే స్థానికులు ఇందుకు ససేమిరా అంటున్నారు. తమ స్థలాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్థానికులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూముల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు దాదాపు 1000 నోటీసులు ఇచ్చారు.