నల్గొండ పట్టణంలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు సంస్థ ఏడీఈ వేణుగోపాలచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు, భారత్ గ్యాస్ గోదాం ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని వివరించారు. ఈవిషయం గుర్తించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.