ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవి రాకముందే ఎండల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మితంగా ఉండేవి కానీ, ఈసారి మధ్యాహ్నం 12 గంటలకే 30 డిగ్రీల సెల్సియస్ను దాటుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు రావడానికే ప్రజలు జంకుతున్నారు. వేసవి రాకముందే భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు.