NRPT: పంటలు వేసి రెండు నెలలు గడిచినా రైతు భరోసా నిధులు విడుదల కాలేదని సీపీఐఎం కార్యదర్శి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల ఆలస్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.