హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన నాలుగు లక్షల రూపాయల LOCని వారి కుటుంబ సభ్యులకు ఎంపీ కడియం కావ్య అందజేశారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు.