SRCL: సిరిసిల్ల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం సహా ఆచార్యునిగా పనిచేస్తున్న జగన్నాథం నరసయ్య కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ పి. సమ్ములాల్ పర్యవేక్షణలో “తెలంగాణలో SHG ద్వారా గిరిజన మహిళా సాధికారత” అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.