MBNR: కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీని అవమానించారని నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. హన్మగల్ల బాల్ రాజ్, ప్రశాంత్, పవన్, మణికంఠ తదితరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యపై ఏబీవీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.