WGL: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని DEO శ్రీధర్ సుమన్ ఆదేశించారు. CS, DOలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారని వెల్లడించారు.