NGKL: ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ రాజపుత్ర మహేశ్ సింగ్ శనివారం భూమి పూజ చేశారు. భవన స్లాబ్ నిర్మాణ పనులను వార్డు సభ్యులతో కలిసి పరిశీలించిన ఆయన, పనులు అత్యంత నాణ్యతతో ఉండాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రయ్య యాదవ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.