MBNR: ‘ప్రజా బాట’లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా విద్యుత్ ఎస్ఈ భీమా నాయక్ అన్నారెడ్డిపల్లిని సందర్శించారు. గ్రామంలో వేలాడుతున్న పాత వైర్లు, తుప్పు పట్టిన స్తంభాలను పరిశీలించారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ మరమ్మతులు చేపట్టాలని.. విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.