ఆదిలాబాద్ జిల్లాలో ‘అరైవ్ ఆలైవ్’లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వారానికి 3 పాఠశాలల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన పొందిన విద్యార్థులకు ప్రత్యేక బ్యాడ్జీలు అందజేస్తామన్నారు.