GDWL: గద్వాలలో నిర్వహించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వీడ్కోలు సభలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల్లో చేరాక రోగుల పట్ల మానవత్వం, సహానుభూతితో వ్యవహరించాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసి జిల్లా ప్రతిష్టను నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.