HYD: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్గా అనస్తీషియా విభాగాధిపతి ప్రొ.ఆవుల మురళీధర్ను వైద్య ఉన్నతాధికారులు నియమించారు. సూపరింటెండెంట్ ప్రొ.వాణి విదేశాలకు వెళ్లడంతో ఆమె తిరిగివచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు.