RR: చేవెళ్ల మున్సిపాలిటీ, మొయినాబాద్ కార్యాలయాలలో నిర్వహించిన బడ్జెట్ సమావేశలలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటి 2026-27కు బడ్జెట్ అంచనాను ఆమోదించారు. అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయల కల్పనకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.