KMM: బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి జిల్లా అటవీ శాఖాధికారి (డీఎస్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పలు సూచనలు చేశారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును ఆయన మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ను పరిశీలించారు.