ADB: తాంసి, భీంపూర్ మండల పరిధిలో నేడు శనగ కొనుగోలు నిలిపివేస్తున్నట్లు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ మంగళవారం తెలియజేశారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు నిలిపివేయడం జరిగిందన్నారు. తర్వాత కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే వెల్లడిస్తామని తెలియజేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.