KNR: ఈరోజు నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు గంగాధర మండలంలో మొదటిరోజు 100 శాతం హాజరు నమోదైందని మండల విద్యాధికారి డా. ఏనుగు ప్రభాకర్ రావు తెలిపారు. మండలంలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 767 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి పరీక్ష తెలుగు ప్రశాంతంగా ముగిసిందని MEO పేర్కొన్నారు.