MDK: తూప్రాన్లోని గీతా స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహతి తయారు చేసిన ‘వ్యర్ధాల నిర్వహణ- ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దక్షిణ భారత స్థాయితోపాటు, జాతీయస్థాయికి ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రాజెక్టులు ఎంపిక కాగా, జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.