VKB: వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డా.కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నెల 16న కుల్కచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య నిపుణులతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, చిన్న పిల్లలు, దంత సమస్యలు, కళ్ల సంబంధిత వైద్య నిపుణులచే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు.