KMM: టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిరుపేద మహిళలకు ‘రిటైల్ అండ్ సేల్స్ అసిస్టెంట్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ విజేత తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉండి పదో తరగతి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 3 నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్హత కలిగిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.