GDWL: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామ సమీపంలోని శివాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో నంది కోళ్ల సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఆకట్టుకుంది. గుంత రంగయ్య శెట్టి, రఘు యాదవ్, రాజశేఖర్ తదితరులు పాల్గొని స్వామివారికి సేవలు అందించారు.