గద్వాల జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్కు సోమవారం సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్ రావు, రామన్ గౌడ్, కలీమ్ తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు.