JGL: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాష్ట్ర మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన కిచెన్ షెడ్స్ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. చదువును మించిన ఆస్తి లేదని అన్నారు.