VKB: తాండూరులోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఏప్రిల్ 11న స్వామివారి రథోత్సవం, 12న లంకాదహనం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.