ADB: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్దతకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రిజర్వేషన్ల పేరిట మభ్యపెడుతూ.. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.