GDWL: అలంపూర్ క్షేత్రంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. గత 159 రోజులకు సంబంధించి నిర్వహించిన ఈ లెక్కింపులో రూ. 24,77,093 నగదు వచ్చిందని ఆలయ ఈవో. దీప్తి వెల్లడించారు. నగదుతో పాటు 8 యుఎస్ డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 10 కెనడా డాలర్లు కూడా భక్తులు కానుకలుగా సమర్పించారు.