NGKL: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి CMRF, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.