మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి వివరాలు తెలిసిన వారు 8712656546 నంబర్ను సంప్రదించాలని SI తహసీనుద్దీన్ పేర్కొన్నారు.