KMM: భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రజా హృదయ సామ్రాజ్యానికే అధిపతి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన వాజ్పేయి శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అటల్జీ నాయకత్వంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా ‘అటల్జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.