మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శిక్షణ తరగతులను కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, DCP భాస్కర్ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు.