HYD: సమాజంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘విద్వేష ప్రసంగాలు & నేరాల నిరోధక బిల్లు 2026’ను రూపొందించింది. మత విద్వేషాలను రగిల్చేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వం దీని ప్రకారం కఠిన చర్యలు తీసుకోనుంది. నేరం రుజువైతే ఒకటి నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.