JGL: మహిళల ఆర్థిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో రూ. 10 లక్షలు, కట్కాపూర్లో రూ. 20 లక్షలు, వస్తాపూర్లో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టిన మహిళా సంఘాల నూతన భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. జడ్పీ సీఈవో, ఎంపీడీవో, ఎంపీవో, సర్పంచులు పాల్గొన్నారు.